'జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి'
SKLM: జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోటబొమ్మాళి కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి ఎం.రోషిని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్ కేసులను, ఫ్రీ డెడికేషన్ కేసులను ఇరువర్గాలు రాజీతో పరిష్కారం చేయాలని సూచించారు.