బాపట్ల అభివృద్ధికి లోకేష్ భరోసా

బాపట్ల అభివృద్ధికి లోకేష్ భరోసా

BPT: మంత్రి లోకేష్‌ను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, సూర్యలంక పర్యాటకంపై ఆయనకు వివరించారు. అక్కడ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.