అగనంపూడిలో శంకుస్థాపన చేసిన మేయర్

అగనంపూడిలో శంకుస్థాపన చేసిన మేయర్

VSP: అగనంపూడి జోన్ 77వ వార్డులో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కార్పొరేటర్ బట్టు సూర్యకుమారితో కలిసి తారు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ తెలిపారు.