నూరు శాతం హాజరు కావాలి: DEO

ASR: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను DEO మల్లేశ్వరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 66 మంది హాజరు కావాల్సి ఉండగా 40 మంది విద్యార్థులు మాత్రమే వచ్చారని DEO తెలిపారు. మిగిలిన విద్యార్థులు ఎందుకు రాలేదో తెలుసుకోవాలని టీచర్ను ఆదేశించారు. అవసరం అయితే వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. 100 శాతం విద్యార్థులు హాజరు కావాలని ఆదేశించారు.