ఇండియన్ నేవీ 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చమురు సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకు ఇండియన్ నేవీ 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'ను చేపట్టింది. ఇందుకోసం భారత్ 5 యుద్ధనౌకలను పశ్చిమాసియాకు తరలించింది. హార్మూజ్ గుండా నుంచి ప్రయాణించే భారత చమురు ట్యాంకర్లకు ఇవి రక్షణగా నిలవనున్నాయి.