ముగిసిన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు
AKP: అనకాపల్లి పట్టణం గవరపాలెంలో నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిసాయి. నెలరోజులపాటు జరిగిన ఉత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 5,000 మంది మహిళలు అమ్మవారి ఘటాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.