సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
ELR: జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో గురువారం సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో రమణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వ కార్యకలాపాలు తెలుసుకోవచ్చు అన్నారు.