నరేష్ రెడ్డి విగ్రహావిష్కరణకు విప్కు ఆహ్వానం
మహబూబాబాద్: పురుషోత్తమ గూడెం ఏరువాక ప్రాంతంలో ఈ నెల 23న జరుగు స్నేహ యూత్ వ్యవస్థాపకులు నూకల నరేష్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావలసిందిగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్కు ఆహ్వానం అందజేశారు. స్నేహ యూత్ అధ్యక్షులు నూకల అభినవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సభ్యులు విప్ను కలిసి ఆహ్వానించారు.