'భూ సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి'
ASR: రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఆర్వోఎఫ్ఆర్, మ్యుటేషన్కు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లో ఆధార్ నంబర్లను సరిచేసి, ఏవోల లాగిన్కు పంపించాలని తెలిపారు.