ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రారంభం
TG: ఆదివాసీ ప్రజల్లో చైతన్యం నింపడం, వారిని ఆధునిక సమాజంతో మమేకం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన సంక్షేమ శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ కార్యక్రమంలో భాగంగా 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్కు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు.