VIDEO: పాకిస్తాన్ టీ20 లీగ్లో బాల్ టాంపరింగ్
PSLలో కరాచీ కింగ్స్తో మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ ఆటగాడు ఫకర్ జమాన్ బంతిని తన గోళ్లతో గిల్లుతూ కెమెరాకు దొరికిపోయాడు. అంపైర్లు టాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించి కరాచీ జట్టుకు 5 పరుగుల ఇచ్చి బంతిని మార్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'మొన్నేమో బంతి రంగు(PINK) మార్చారు, ఇప్పుడేమో ఆకారాన్నే మారుస్తున్నారు. పాక్ ఆటగాళ్ల బుద్ధి మారదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.