ఈ ప్రాంతాల్లో నేడు విద్యుత్కు అంతరాయం
GNTR: గుంటూరులోని మానససరోవరం 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనుల కారణంగా గురువారం విద్యుత్కు అంతరాయం కలగనుంది. ఈ మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ PH ఖాన్ ఓ ప్రకటలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నందివెలుగు రోడ్డు, రాహుల్ గాంధీనగర్, జియావుద్దిన్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని వెల్లడించారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.