ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.