భూముల వేలం ఆపాలని రైతుల నిరసన
VZM: పాత శ్రీరంగరాజపురం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న దేవస్థాన భూములను వేలం వేయనున్నట్లు ఎండోమెంట్స్ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు సూచించగా, తమకు న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.