శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో ఎంపీ అప్పలనాయుడు, తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.