విద్యా హక్కు చట్టం పేద విద్యార్థులకు వరం
KDP: పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ఒక వరమని BJP జిల్లా అధికార ప్రతినిధి హరి ప్రసాద్ అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ..ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదింటి పిల్లలకు కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, 2026-27లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.