ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్.. ప్రజల ఆవేదన

ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్.. ప్రజల ఆవేదన

NLR: అనంతసాగరం మండలం సంజీవ్ నగర్‌లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. వాటర్ ట్యాంకుకు ఉన్న పిల్లర్లలో రెండు కాంక్రీట్ ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. గురువారం ప్రజలు మాట్లాడుతూ.. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.