'ఆగస్టు 25న జరిగే ధర్నాను జయప్రదం చేయాలి'

BDK: చర్ల మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల మహాసభలో కమిటీని ఎన్నుకున్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 25న జరిగే కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని CITU జిల్లా కోశాధికారి జిలకర పద్మ పేర్కొన్నారు. అధ్యక్షురాలిగా వరలక్ష్మి, కార్యదర్శిగా సుజాత, కోశాధికారి చంద్రకళ, 14 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.