భవనంపై నుంచి కిందపడి బాలుడి మృతి
NRML: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానిక గౌతమినగర్లో ఓ శుభకార్యానికి వచ్చి నాలుగు అంతస్తుల భవనంపై ఆడుకుంటూ నిర్మల్ జిల్లాకు చెందిన బాలసంకుల సహస్రన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.