ఇరాన్పై 15 వేల బాంబులేశాం: ఇజ్రాయెల్
ఇరాన్పై ఇప్పటివరకు 15 వేలకుపైగా బాంబులతో దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు వాడిన ఆయుధాల గురించి ఆయన వివరించారు. గతేడాది జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ప్రయోగించిన బాంబుల సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువని తెలిపారు. ఇరాన్, లెబనాన్లపై మరిన్ని దాడులు చేస్తామని పేర్కొన్నారు.