డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
KNR: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025లో భాగంగా జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న చొప్పదండి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.