చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ దుండగుడి రిమాండ్
RR: చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని నిన్న రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ అడిషనల్ DCP ఉదయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువతి RCపురంలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగుడు మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అబ్దుల్లా అనే వ్యక్తిని సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి రిమాండ్కు తరలించారు.