'పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

'పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

KRNL: చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం సంపత్ నగర్‌లోని ఉర్దూ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎంపీ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను తిలకించారు.