విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,66,012 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 348 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 21 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 2280 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.