పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

ASF: ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని జైనూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన కిషన్ లాల్, అజయ్ పాల్, ఆశిష్ జైస్వాల్‌గా సీఐ రమేష్ గుర్తించారు. బావుల్లో రాళ్లను పేల్చేందుకు వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు