రూ. 50 లక్షలతో సీసీ డైన్ నిర్మాణానికి ఆదేశాలు

KRNL: కర్నూలు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, 37వ వార్డు శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. రహదారులపై నీరు నిలవకుండా ఆక్రమణలు తొలగించి, కచ్చ కాలువ నిర్మించాలని తెలిపారు. శాశ్వత పరిష్కారానికి రూ. 50 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.