వరంగల్ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ. 6,980 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,500 పలకగా, వండర్ హాట్(WH) మిర్చి రూ.18,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,700, కొత్త తేజా మిర్చి రూ.17,001 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.