మోపిదేవి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం
కృష్ణా: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా ఆలయానికి రూ.9,97,957 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరాంచారు.