నేడు బసవనపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే సమావేశం
సత్యసాయి: బసవనపల్లి పంచాయతీ కూటమి నాయకులతో ఎమ్మెల్యే ఎమ్.ఎస్ రాజు తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు అమరాపురం సింగిల్ విండో అధ్యక్షుడు గణేష్ తెలిపారు. బసవనపల్లి పంచాయతీ గ్రామాల కూటమి కుటుంబ సభ్యులు మడకశిర తరలి రావాలని కోరారు.