17న హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి
TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైంది. ఆమె ఈనెల 17న HYDకు చేరుకొని, 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక కార్యక్రమంలో, 20న గచ్చిబౌలిలోని శాంతిసరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. 22న ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.