జడ్పీ హైస్కూల్ పాఠశాల సిబ్బంది ప్రచారం
AKP: రోలుగుంట మండలం జానకిరామపురం జడ్పీ హైస్కూల్ పాఠశాల సిబ్బంది బుధవారం సాయంత్రం నూతన విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు ఆధ్వర్యంలో పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను నూతన విద్యార్థులకు వివరించారు. అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నామన్నారు.