తిరుమల శ్రీవారి సన్నిధిలో పూల నాగరాజు
ATP: కార్తీక సోమవారం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ రీజినల్ బోర్డు ఛైర్మన్ పూల నాగరాజు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ బ్రేక్ సమయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్తో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామిని కోరుకున్నారు.