ఘనంగా ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమం ప్రారంభం
TPT: రాష్ట్రవ్యాప్తంగా ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా అలిపిరి డిపోలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వారి దైనందిన జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.