50 మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు
అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ సహకారంతో 50 మందికి పైగా మూగ, బధిర చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చిన్నారులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ సర్జరీలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.