'కూటమి ప్రభుత్వంపై విమర్శలు అర్ధరహితం'
VSP: కూటమి ప్రభుత్వంపై సీపీఎం నేత గంగరావు చేసిన విమర్శలను మాజీ కార్పొరేటర్లు విల్లూరి భాస్కరరావు, ఉరికిటి నారాయణరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని, పార్కుల్లో వాకర్స్ నుంచి వసూలు చేసే చార్జీలు నిర్వహణ కోసమేనని తెలిపారు.