భైరవకోనలో భక్తుల సందడి

భైరవకోనలో భక్తుల సందడి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని భైరవకోన జలపాతంలో స్థానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసారు.