రోడ్డు ప్రమాదం.. ఓ యువతి మృతి
KRNL: ఆదోని- సిరుగుప్ప రహదారిలో కారు చెట్టుకు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు, డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, ఒక యువతి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఇస్వి పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.