ప్రత్యేక అలంకరణలో బల్కంపేట అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో బల్కంపేట అమ్మవారు

HYD: బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం కావడంతో నగరవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.