గేమ్ ఛేంజర్ వస్తోంది: లోకేష్
AP: విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి గ్రోత్ ఇంజిన్గా మారుతున్న ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ తయారవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమంత్రి పీయుష్ గోయెల్ సహకరిస్తున్నారని చెప్పారు. గిగా డేటా సెంటర్ ఏపీకి రానుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వివరాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.