3న నాచగిరి క్షేత్రం మూసివేత
SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 3న మంగళవారం కేతు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో రంగాచారి తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆలయం, ఉపాలయాలకు ద్వార బంధనం చేస్తున్నట్లు వివరించారు. 4న సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.