VIDEO: కలెక్టర్ కార్యాలయం ఎదుట CPM ధర్నా
BHPL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు CPM ఆధ్వర్యంలో వలస ఆదివాసీలు మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. CPM నాయకులు మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గూడాలపై అటవీ శాఖ అధికారుల దాడులను ఆపాలని, వలస జీవులకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM నేతలు ఉన్నారు.