రైలు పట్టాలపై యువకుడి మృతదేహం లభ్యం

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం లభ్యం

అన్నమయ్య: చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైల్వే పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలానికి చెందిన షేక్ అస్లాం (20)గా గుర్తించారు. ఘటనపై చిత్తూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.