శేరేపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం

శేరేపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం

WG: మొగల్తూరు మండలం శేరేపాలెంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యులు గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు.