అడెల్లి మహా పోచమ్మ హుండీ ఆదాయం రూ. 53 లక్షలు

అడెల్లి మహా పోచమ్మ హుండీ ఆదాయం రూ. 53 లక్షలు

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 15 హుండీల ద్వారా రూ. 53,97,520 నగదు ఆదాయం లభించింది. అదనంగా 125.490 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి సమకూరింది. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.