నేటి నుంచి వీరవల్లిలో ఘనంగా శ్రీ తిరుపతమ్మ తిరునాళ్లు

నేటి నుంచి వీరవల్లిలో ఘనంగా శ్రీ తిరుపతమ్మ తిరునాళ్లు

కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ, గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కల్యాణం జరగనుంది. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది.