కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇందిరమ్మ ఇళ్ళు: MLA

ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం 17 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను MLA పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. లబ్ధిదారులు వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, కావున పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు.