ముస్లిం జర్నలిస్టులకు రంజాన్ తోఫా
VSP: రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని ముస్లిం జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు రంజాన్ తోఫా అందజేశారు. బుధవారం అక్కయ్యపాలెంలో జర్నలిస్టులకు రూ.20 వేల నగదు, ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు.