మంగళగిరిలో PDS బియ్యం పట్టివేత

మంగళగిరిలో PDS బియ్యం పట్టివేత

GNTR: మంగళగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటోనగర్‌లోని నాలుగో లైన్‌లో పార్క్ చేసి ఉన్న మినీ వ్యాన్‌ను తనిఖీ చేయగా, పీడీఎస్ బియ్యం బయటపడినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఆటోనగర్‌లోని ఓ గోదాముకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారని, అక్కడ తనిఖీ చేయగా మరో 70 బ్యాగులు లభ్యమయ్యాయని అన్నారు.