ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతం
కృష్ణా: ఇవాళ ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో మావోయిస్టులపై ఎన్కౌంటర్ జరిపినట్టు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్చంద్ర లడ్డ తెలిపారు. కృష్ణా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. మొత్తం మీద 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు.