ఏపీ అసెంబ్లీని సందర్శించిన కేవీబీ పురం విద్యార్థులు

ఏపీ అసెంబ్లీని సందర్శించిన కేవీబీ పురం విద్యార్థులు

TPT: కేవీబీ పురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన 30 మంది విద్యార్థులు శుక్రవారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులతో ముచ్చటించి అసెంబ్లీ నిర్వహణ, ప్రజాప్రతినిధుల పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం సూచించారు.